కోల్కతా: రాష్ట్రంలో బీజేపీ నాయకులకు హైకోర్టు రక్షణ కల్పిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు కేసుల్లో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి.. ఆ కేసుల విషయమై హైకోర్టుకు వెళ్లగా, అతడిపై తీవ్ర చర్యలకు దిగరాదంటూ గత సోమవారం స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈనేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను తప్పుబడుతూ అభిషేక్ బెనర్జీ పై వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రక్షణ కోరుతూ తాను కోర్టుకు వెళితే. ఇదే న్యాయమూర్తి తన అభ్యర్థనను తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు.