కోల్కతా, ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితుల కోసం సీబీఐ ఒక ఈ-మెయిల్ను రూపొందించింది. సందేశ్ఖాలీలో కొందరు నేతల ఆధ్వర్యంలో మహిళలపై దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు భారీగా జరిగినట్టు ఆరోపణలు రావడంతో దానిపై సీబీఐ విచారణ జరపాలంటూ కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
దీంతో కోర్టు అనుమతితో సీబీఐ గురువారం ఈ మెయిల్ చిరునామాను ప్రకటించింది. సందేశ్ఖాలీ బాధితులు తమ ఫిర్యాదులను sandeshkhali@cbi.gov.inకు ఈ-మెయిల్ చేయవచ్చునని వెల్లడించింది. ఈ ఈ-మెయిల్ గురించి పత్రికలలో ప్రకటించడంతో పాటు స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేయాలంటూ నార్త్ 24 పరగణాల జిల్లా మేజిస్ట్రేట్ను హైకోర్టు ఆదేశించింది. బాధితులు నిర్భయంగా తమ ఫిర్యాదులను పంపాలని సీబీఐ కోరింది.