కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్లో జరిగిన హింసలో 8 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఇవాళ కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. ఇక ఆ కేసును సీబీఐకి అప్పగించాలని తన ఆదేశాల్లో హైకోర్టు పేర్కొన్నది. ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఆ ఘటనకు సంబంధించిన రిపోర్ట్ను దాఖలు చేయాలని సీబీఐని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాత్సవ్, జస్టిస్ ఆర్ భరద్వాజ్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది.