న్యూఢిల్లీ : రూ. 28,840 కోట్ల వ్యయంతో 2035-36 వరకు పదేండ్ల కాలానికి సవరించిన ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రస్తుతం ఉపయోగంలో లేని రన్వేలను అభివృద్ధి చేసి 100 విమానాశ్రయాలుగా మార్చనున్నట్టు చెప్పారు.
ఇందుకోసం రూ.12,159 కోట్లను వెచ్చించనున్నట్టు చెప్పారు. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఇమిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ పథకాన్ని మరో ఐదేండ్ల పాటు పొడిగిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.