న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA)ను లోక్సభ ఎన్నికల లోపే అమలు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈటీ బిజినెస్ సమ్మిట్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన తమ ప్రభుత్వ గురించి వివరణ ఇస్తూ.. 2019లో తయారు చేసిన సీఏఏ చట్టాన్ని రాబోయే లోక్సభ ఎన్నికల లోపే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు చెప్పారు.
సీఏఏ గురించి ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టించారని, వాళ్లను రెచ్చగొట్టారని, వేధింపులు తట్టుకోలేక జీవనోపాధి కోసం పాక్, ఆఫ్ఘన్, బంగ్లా నుంచి భారత్కు వచ్చిన వారికి పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎవరి భారతీయ పౌరసత్వాన్ని లాక్కోవడం ఆ చట్టం ఉద్దేశం కాదన్నారు.
ఉమ్మడి పౌర స్మృతి అమలు కూడా రాజ్యాంగ లక్ష్యమన్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఆ పౌర స్మృతి బిల్లు గురించి చర్చించారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌర స్మృతిని విస్మరించిందన్నారు. ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు చేయడం సామాజిక మార్పు అన్నారు. సెక్యులర్ దేశంలో మతపరమైన పౌరస్మృతులు ఉండవన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయన్నారు. ఇక ఎన్డీఏకు 400 క్రాస్ అవుతాయన్నారు. మోదీ నాయకత్వంలో తమ ప్రభుత్వం మూడవ సారి ఏర్పడబోతోందన్నారు.