చెన్నై, మే 8: తమిళనాడు అసెంబ్లీలో బీజేపీ నుంచి మొదటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సీ వేలాయుధన్ బుధవారం కన్నుమూశారు. 73 ఏండ్ల వేలాయుధన్ మొదటిసారి 1996లో పద్మనాభపురం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఆయన మృతికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాక ముందు వేలాయుధన్ ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సేవాభారతిలో పనిచేశారు. అలాగే 1975-77 మధ్య ఎమర్జెనీ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.