చెన్నై: కొందరు వ్యక్తులు బస్సు కండక్టర్ను దారుణంగా కొట్టారు. (Bus conductor thrashed) అతడి వద్ద ఉన్న క్యాష్ బ్యాగ్ను లాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళా ప్రయాణికులు జోక్యం చేసుకుని ఆ కండక్టర్ను కాపాడారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ బస్సు చతిరం నుంచి తువ్వకుడికి బయలుదేరింది. అయితే వరగనేరి చులైకరైలో మరియమ్మన్ ఆలయం వద్ద ఉన్న బస్టాప్లో ఒక మహిళ దిగలేదు. దీంతో బస్సును ఆపాలని కండక్టర్ను ఆమె అడిగింది. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరుగడంతో కొంత దూరంలో ఆ మహిళ బస్సు దిగింది.
కాగా, ఆ బస్సు చతిరం బస్టాండ్కు తిరిగి రాగా ఐదుగురు యువకులు అందులోకి ఎక్కారు. తమకు చెందిన మహిళను కండక్టర్ మూకయ్యన్ దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి తర్వాత మరొకరు ఆ కండక్టర్ను కొట్టడంతోపాటు పిడిగుద్దులు కురిపించారు. కండక్టర్ వద్ద ఉన్న క్యాష్ బ్యాగు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు.
మరోవైపు బస్సులోని కొందరు మహిళా ప్రయాణికులు జోక్యం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల దాడి నుంచి ఆ కండక్టర్ను కాపాడారు. అనంతరం ఆ కండక్టర్ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ బస్సులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన కండక్టర్పై దాడి వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#JUSTIN திருச்சியில் தனியார் பேருந்துக்குள் புகுந்து நடத்துநர் மீது தாக்குதல்#Trichy #conductor #news18tamilnadu | https://t.co/7dpn9FD15R pic.twitter.com/LHQ1ZV0XFv
— News18 Tamil Nadu (@News18TamilNadu) February 11, 2024