న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఢిల్లీ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులందరినీ ఏడు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. ఈనెల 13న సాగర్ శర్మ, మనోరంజన్ అనే వ్యక్తులు లోక్సభ జీరో అవర్ జరుగుతుండగా పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకి గ్యాస్ను వదిలిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
నినాదాలు చేస్తూ సభలో తీవ్ర గందరగోళం సృష్టించగా ఎంపీలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు సభలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తలకు విజిటర్ పాసులు అందచేసిన బీజేపీ ఎంపీ ప్రతాప సింహను ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టారు.
ఇక పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో నిందితుల్లో ఒకరి దుస్తులు, షూస్, దగ్ధం చేసిన మొబైల్ ఫోన్ విడిభాగాలు రాజస్ధాన్లో లభ్యమయ్యాయి. కాగా నిందితుడి ఫోన్లన్నీ ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా వద్ద ఉన్నాయని, ఆయన ఫోన్లను పగలగొట్టి ఆపై దగ్ధం చేశాడని పోలీసులు చెబుతున్నారు.
Read More :