ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగాయి. యూపీలోని మీరట్కు దగ్గర్లో ఉన్న ఛజార్సి టోల్ ప్లాజా వద్ద కాపుకాచిన దుండగులు.. అసదుద్దీన్ కారుపై కాల్పులు జరిపారు. యూపీ ఎన్నికల ప్రచారం తర్వాత కితువార్ నుంచి అసదుద్దీన్ ఢిల్లీకి బయలుదేరారు. ఛజార్సి టోల్ ప్లాజా వద్దకు రాగానే ఇద్దరు దుండగులు.. ఒవైసీ కాన్వాయిపై 3 నుంచి 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అసదుద్దీన్కు ఎటువంటి గాయాలు కాలేదు. తాను క్షేమంగా ఉన్నానని అసదుద్దీన్ ప్రకటించారు.
ఛజార్సీ టోల్ గేట్ వద్ద నా కారుపై దాడి జరిగింది. దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో నా కారు టైర్ పంక్చర్ అయింది. కాల్పులు జరిపిన దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. నేను వెంటనే వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాను. నాకు ఏం కాలేదు.. నేను క్షేమంగా ఉన్నా.. అని అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ట్వీట్ చేశారు. బుల్లెట్స్ తగిలి కారుకు అయిన డ్యామేజీ ఫోటోను కూడా ఒవైసీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
AIMIM chief Asaduddin Owaisi says that 3-4 rounds of bullets were fired upon his vehicle near Chhajarsi toll plaza while he was heading to Delhi after an election-related event in Kithaur, Meerut (in Uttar Pradesh).
Visual from the spot. pic.twitter.com/WXSQS88bMA
— ANI (@ANI) February 3, 2022