అహ్మదాబాద్, ఏప్రిల్ 26: బుల్డోజర్ రాజకీయం ఢిల్లీలోని జహంగీర్పురి తర్వాత ఇప్పుడు మరో బీజేపీ పాలిత గుజరాత్కి చేరింది. అక్రమ నిర్మాణాల పేరుతో గుజరాత్లోని సబర్కాంత జిల్లా హిమ్మత్నగర్ మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూల్చివేతను ప్రారంభించారు.
శ్రీరామనవమి నాడు మతహింస జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఛపారియా ఏరియాలో కూల్చివేత జరుగుతుండటం గమనార్హం. ఇందులో మతహింస కేసులో నిందితులుగా ఉన్న వారి ఇండ్లు, దుకాణాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. అంతకుముందు ఆనంద్ జిల్లా అధికారులు కూడా ఖంభాట్ పట్టణంలో జరిగిన మత ఘర్షణలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నిర్మాణాలను తొలగించేందుకు బుల్డోజర్లతో కూల్చివేత డ్రైవ్ చేపట్టింది.