Budget Session | ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో షిప్టుల వారీగా సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకూ జరుగుతాయి. ఇక రెండో విడత 14 మార్చి నుంచి ఏప్రిల్ 8 వరకూ జరుగుతాయి.
దాదాపు 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అలర్ట్ అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. అయితే కరోనా రూల్స్ను కచ్చితంగా పాటిస్తూ, పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ సభ్యులందరూ భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.