న్యూఢిల్లీ: స్వయంప్రతిపత్తి సంస్థ యూజీసీ సహా ఐఐటీ, ఐఐఎంలకు నిధులలో కేంద్రం గణనీయంగా కోత విధించింది. యూజీసీకి 60 శాతం కోత విధించారు. మేనేజ్మెంట్ విద్యను అందించే ఐఐఎంలకు సైతం వరుసగా రెండో ఏడాది కూడా నిధులను గణనీయంగా తగ్గించింది. యూజీసీకి ఈ సంవత్సరం రూ.2500 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
అదే సమయంలో సెంట్రల్ యూనివర్సిటీల సపోర్ట్ గ్రాంట్ను 28 శాతానికి పైగా పెంచారు. ఐఐఎంల బడ్జెట్ను గత ఏడాది 608.23 కోట్ల నుంచి 331 కోట్లకు గణనీయంగా కోత వేశారు. పాఠశాల విద్య కేటాయింపులను 72,473.80 కోట్ల నుంచి 73,008 కోట్లకు పెంచగా, ఉన్నత విద్యకు 57244.48 కోట్ల నుంచి 47619.77 కోట్లకు తగ్గించారు.