యూపీలో జరగబోయే రాంపూర్ లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేసే విషయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ చీఫ్ మాయావతి ఆదివారం పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలోనే పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వమని కూడా తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో మాయావతి ఈ విషయంపై ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 23 న రాంపూర్ లోక్సభ సీటుతో పాటు ఆజంగఢ్ సీటుకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. 26న ఫలితాలను విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది.
29-05-2022-BSP PRESS NOTE-UP PARTY MEETING pic.twitter.com/2sal0WxPSz
— Mayawati (@Mayawati) May 29, 2022