లక్నో: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి(Mayawati) డిమాండ్ చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో ఆమె ఈ డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ మీటింగ్ను నిర్వహించారు. కుల గణన కోసం దేశంలోని అన్ని దిక్కుల నుంచి డిమాండ్ వస్తున్నట్లు ఆమె తెలిపారు. కుల గణన డిమాండ్తో బీజేపీ నిద్రలేని రాత్రులు గడుపుతోందని విమర్శించారు. జాతీయ స్థాయిలో సరైన పద్ధతిలో కుల గణన చేపట్టాలని, ప్రజలకు అందాల్సిన హక్కుల్ని అందేలా చూడాలని మాయావతి డిమాండ్ చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీన ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 22వ తేదీ వరకు 15 సిట్టింగ్స్ ఉంటాయి.
1. संसद के आगामी 4 दिसम्बर से शुरू हो रहे शीतकालीन सत्र से पहले आज सर्वदलीय बैठक में बीएसपी द्वारा सरकार से देश में जातीय जनगणना कराए जाने की माँग पुनः की गयी। अब जबकि इसकी माँग देश के कोने-कोने से उठ रही है, केन्द्र सरकार द्वारा इस बारे में अविलम्ब सकारात्मक कदम उठाना जरूरी।
— Mayawati (@Mayawati) December 2, 2023