న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ జోరందుకుంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. కానీ, మరో ప్రధాన పార్టీ అయిన బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా స్తబ్దుగా ఉన్నది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా దూకుడుగా వ్యవహరిస్తూ క్యాడర్లో జోష్ నింపే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈసారి చడీచప్పుడు లేకుండా స్తబ్దుగా ఉంటున్నారు.
మాయావతి తీరుపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, ఆ పార్టీ తరఫున యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యురాలు ప్రియాంకాగాంధీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రాష్ట్రమంతా ఎన్నికల కోలాహలం నెలకొని ఉంటే మాయవతి ఎలాంటి ప్రచార ఆర్బాటం లేకుండా ఎందుకు సైలెంట్ అయ్యారో అర్థం కావడంలేదని, ఆమె తీరు తనను ఆశ్యర్యానికి గురిచేస్తున్నదని ప్రియాంక వ్యాఖ్యానించారు. పోలింగ్ సమయం దగ్గరపడ్డా ఆమె ఎందుకు అంటీముట్టనట్టు ఉంటున్నారోనని సందేహం వ్యక్తంచేశారు.
ఆరేడు నెలల క్రితం నుంచే మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ యాక్టివ్గా లేకపోవడాన్ని తాము గమనించామని, అయితే ఎన్నికల సమయం దగ్గరపడినప్పుడు దూకుడు పెంచుతారని భావించామని ప్రియాంక చెప్పారు. ఇప్పుడు తీరం పోలింగ్ తేదీలు దగ్గరపడ్డా ఆ పార్టీ సైలెంట్గానే ఉన్నదని ఆమె ఆశ్యర్యపోయారు. కాగా, రాష్ట్రంలో దళిత, బహుజన ఓట్లను చీల్చి బీజేపీకి మేలు చేయడం కంటే.. స్తబ్ధుగా ఉండి సమాజ్వాది పార్టీ గెలిచేలా వ్యవహరించడమే ఉత్తమమని మాయావతి భావిస్తున్నట్లు సమాచారం.