పాకిస్తాన్కు చెందిన 11 ఫిషరీ బోట్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుజరాత్ బుజ్లోని హరామీ నల్లా ప్రాంతంలో సీజ్ చేశారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ ప్రకటించింది. ఫిబ్రవరి 9 న పాకిస్తాన్కు చెందిన మత్స్యకారులు తమ బోట్లతో సరిహద్దు దాటడానికి ప్రయత్నించారని బీఎస్ఎఫ్ పేర్కొంది. రాత్రి వేళల్లో తాము గస్తీ తిరుగుతుండగా వారిని గుర్తించామని, 11 బోట్లను సీజ్ చేశామని బీఎస్ఎఫ్ తెలిపింది. మత్స్యకారుల కోసం బీఎస్ఎఫ్ జవాన్లు మూడు బృందాలుగా విడివడి, ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లతో పలు చోట్లలో గాలిస్తున్నారని, వారెక్కడ దాక్కున్నారని తీవ్రంగా గాలిస్తున్నట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ గాలింపులో భాగంగా సర్క్రిక్ ప్రాంతంలోని తోటల్లో కూడా గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం.