జమ్ము : జమ్ముకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థాన్ రేంజర్స్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. రామ్గఢ్ సెక్టార్లో బుధవారం రాత్రి భారత్ బోర్డర్ ఔట్పోస్టులు లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ హెడ్కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు.
గాయపడిన హెడ్ కానిస్టేబుల్ లాల్ ఫామ్ కిమా(50)ను జమ్ములోని జీఎంసీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.