న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని బ్రిటన్ హైకమిషనర్ జానె మారియట్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో పర్యటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే ఇటువంటి చర్య ఆమోదనీయం కాద ని పేర్కొన్నది. ఈ ఉల్లంఘనను ఖండిస్తున్నామని, తమ ఆందోళనను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషనర్ దృష్టికి తీసుకెళ్లారని వెల్లడించింది.