న్యూఢిల్లీ, అక్టోబర్ 7: భారత్, బ్రిటన్ మధ్య టీకా యుద్ధానికి తెరపడింది. కొవిషీల్డ్ టీకా వేసుకొని బ్రిటన్కు వచ్చే ఇండియన్లు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రకటించింది. ఇది ఈ నెల 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కొవిషీల్డ్ను గుర్తించబోమని, భారత్లో వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై అనుమానాలున్నాయని బ్రిటన్ భారతీయులకు క్వారంటైన్ నిబంధన విధించింది. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్కు వచ్చే బ్రిటన్ పౌరులు కూడా క్వారంటైన్లో ఉండాలని నిబంధన పెట్టింది. దీంతో బ్రిటన్ వెనక్కు తగ్గింది.