Bride Reels | ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి స్మార్ట్ వాడే ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతాలుంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది రీల్స్ చేస్తూ గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే, ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామనే విషయాన్ని సైతం మరిచిపోతున్నారు. తాజా పెళ్లి డ్రెస్లో ఉన్న ఓ యువతి కారు బ్యానెట్పై కూర్చొని రీల్స్ చేసింది. ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రీల్స్కు వినియోగించిన కారుకు భారీగా జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటు చేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. ఓ యువతి సివిల్ లైన్స్లోని బ్రైడల్ స్టూడియోలో మేకప్ వేసుకుంది. ఆ తర్వాత రీల్స్ చేసేందుకు స్టోన్ కేథడ్రల్కు చేరుకుంది. ఆ తర్వాత టాటా సఫారీ కారు బానెట్పై కూర్చొని రీల్స్ చేసింది. ఆ తర్వాత హెల్మెట్ ధరించకుండా స్కూటీ నడుపుతూ రీల్స్ చేయడంతో చూసేందుకు జనం తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు రీల్స్ కోసం ఉపయోగించిన సఫారీ వాహనానికి రూ.15,500, హెల్మెట్ ధరించకుండా స్కూటీని నడిపినందుకు రూ.1500 చలాన్ను జారీ చేశారు. సఫారీ వాహనం శంకర్గఢ్కు చెందిన సౌరభ్కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.