న్యూఢిల్లీ: బ్రిక్స్ దేశాల కూటమి 13వ సదస్సు ఈ నెల 9న జరుగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ అంతర్జాతీయ సంబంధాల కాన్ఫరెన్స్కు కూటమిలోని బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (BRICS) దేశాల అధినేతలు హాజరు కానున్నారు. కాగా భారతదేశం బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 2012, 2016 సంవత్సరాల్లో కూడా భారత్ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. కూటమిలోని ఐదే దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ సంబంధాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.