న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దవాఖానల్లోని వ్యర్థాల నుంచి ఇటుకలను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తమిళనాడులోని సోనా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అభివృద్ధి చేశారు. భవన నిర్మాణాల్లో ఎక్కువగా వినియోగించే ఎరుపు రంగు ఇటుకలతో పోల్చితే ‘పాలీ బ్రిక్స్’ మూడు రెట్లు గట్టిదనాన్ని కలిగివుంటాయని, తక్కువ బరువు, తక్కువ కాలంలో వీటిని తయారు చేయవచ్చునని విద్యార్థుల బృందం పేర్కొన్నది.
‘పీపీఈ వ్యర్థాలతో పాలీ బ్రిక్స్ను తయారుచేయాలనుకునే ఆర్గనైజేషన్స్ కోసం టెక్నాలజీ సిద్ధంగా ఉన్నది. 24 గంటల్లోపే క్యూరింగ్ ప్రక్రియ చేపట్టి ఐఎస్వో ప్రమాణాలతో ఇటుకను తయారుచేయవచ్చు. సిమెంట్, మట్టి ఇటుకతో పోల్చితే తక్కువ ఖర్చుతో వీటిని తయారుచేయవచ్చు’నని పేర్కొన్నారు.