న్యూఢిల్లీ: బ్రెస్ట్ క్యాన్సర్(Breast cancer)తో 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది మృతిచెంది అవకాశాలు ఉన్నట్లు లాన్సెట్ కమీషన్ పేర్కొన్నది. గత అయిదేళ్లలో 78 లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ను గుర్తించారు. 2020 సంవత్సరంలో 6,85,000 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. 75 ఏళ్ల లోపు ఉన్న వారిలో 12 మంది మహిళల్లో ఒకరు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, అయితే బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు లాన్సెట్ కమీషన్లో వెల్లడించారు. 2020లో 23 లక్షల ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు.. 2040 నాటికి ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు. అధిక ఆదాయం ఉన్న దేశాల్లో క్యాన్సర్ మృతుల సంఖ్య తగ్గుతున్నట్లు కేంబ్రిడ్జ్ వర్సిటీ రచయిత ఛార్లెట్ కోల్స్ తెలిపారు. కానీ దిగువ, మధ్య తరగతి దేశాల్లో మాత్రం బ్రెస్ట్ కేన్సర్ మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇండియాలో క్యాన్సర్ నుంచి బయటపడి బ్రతికే ఛాన్సు 66 శాతం ఉన్నట్లు అంచనా వేశారు.