న్యూఢిల్లీ : బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష మరోసారి విజయవంతమైంది. మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్టు నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు.
నిర్దేశిత లక్ష్యాన్ని బ్రహ్మోస్ క్షిపణి అత్యంత కచ్చితత్వంలో ఛేదించిందని తెలిపారు. భారత్-రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశాయి. ఈ క్షిపణిని శబ్ధ వేగం కంటే దాదాపు 3 రెట్లు అధిక వేగంతో ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులను భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నది.