న్యూఢిల్లీ: ప్రమాదవశాత్తు బ్రహ్మో స్ క్షిపణి పేలి పాకిస్థాన్లో కూలిన ఘటనకు సంబంధించి భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులపై ప్రభుత్వం వేటువేసింది. గత మార్చి 9న ఈ ఘటన జరిగింది. ప్రామాణిక పని విధానాలు పాటించకపోవడం వల్లే ప్రమాదవశాత్తు క్షిపణి పైకి లేచినట్టు సైనిక న్యాయ విచారణలో తేలింది.
పాక్తో దౌత్యపరమైన ఇబ్బంది తలెత్తడంతో ఈ ఘటనపై భారత రక్షణశాఖ ‘తీవ్ర విచారం’ వెలిబుచ్చాల్సి వచ్చింది. ముగ్గురు అధికారులు ప్రామాణిక పద్ధతులు పాటించకపోవడం వల్లే బ్రహ్మోస్ ఘటన జరిగినట్టు విచారణలో తేలింది.