విజయపుర, ఏప్రిల్ 4: కర్ణాటకలోని విజయపుర జిల్లా లచ్యన గ్రామంలో బోరుబావిలో పడ్డ చిన్నారి సాత్విక్ సతీశ్ ముజగోడ్(2)ని రెస్క్యూ సిబ్బంది 20 గంటలపాటు శ్రమించి రక్షించారు. అతడిని వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించారు. బాలుడి ఒంటిపై గాయాలేమీ కనిపించలేదు. దీంతో అతడి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బుధవారం సాయంత్రం బాలుడు ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించడానికి బోరు బావి పక్కనే అడ్డంగా, నిలువుగా గోతులు తవ్విన సహాయ సిబ్బంది.. 20 గంటలు శ్రమించి కాపాడింది. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారికి సిద్ధలింగ మృత్యుంజయ అని కొత్త పేరు పెట్టారు.