అహ్మదాబాద్: పదో తరగతి చదువుతున్న బాలుడ్ని ఒక టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది. చంద్ఖేడా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. 45 ఏళ్ల వ్యక్తి వద్దకు ట్యూషన్ కోసం వెళ్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ప్రతిరోజూ ఆ బాలుడితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే అతడికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఆ టీచర్ లైంగిక వేధింపులు భరించలేని ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు దీని గురించి చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, బాలుడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ట్యూషన్ టీచర్ను గోవింద్ పటేల్గా పోలీసులు గుర్తించారు. పోక్సోతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. టీచర్ లైంగిక వేధింపులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్లోని ఇతర విద్యార్థులతో కూడా ఆ టీచర్ ఇలాగే ప్రవర్తిస్తున్నాడా అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.