దేవరియా: ఓ బాలుడికి మోమోస్ మీద ఉన్న ఇష్టాన్ని అదనుగా చేసుకొని ముగ్గురు యువకులు అతడి నుంచి రూ.85 లక్షల విలువైన నగలను కాజేశారు. యూపీలోని దేవరియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం డమ్రీ చౌరాహ గ్రామానికి చెందిన ఏడో తరగతి బాలుడికి మోమోస్ అంటే చాలా ఇష్టం.
ఇది గమనించిన ముగ్గురు యువకులు తమకు ఇంట్లోని నగలు తెచ్చిస్తే, మోమోస్ను ఫ్రీగా ఇస్తామని ఆశపెట్టారు. రోజూ ఒక నగ తెచ్చిస్తే అతడు కోరినన్ని మోమోలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అలా ఆ బాలుడు ఇంట్లోని నగలను తెచ్చి వారికి ఇచ్చేవాడు. బాలుడి సోదరి అల్మారాలో నగల కోసం వెతికినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. బాలుడి తండ్రి కుటుంబ సభ్యులను నగల విషయమై విచారించినప్పుడు బాలుడు అసలు విషయం చెప్పాడు.