న్యూఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకున్నది. గురువింద గింజలు తిన్న ఐదేండ్ల బాలుడు 24 గంటల్లోనే మృత్యువాతపడ్డాడు. అతడి ఏడేండ్ల సోదరుడి ప్రాణాలను గంగారాం దవాఖాన వైద్యులు కాపాడారు. 24 గంటల తర్వాత బాలుడిని దవాఖానకు తీసుకొచ్చారని, అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని వైద్యులు పేర్కొన్నారు. మెదడు ఉబ్బిపోయిందని, చిరాకుగా ఉన్నాడని తెలిపారు.
గురివింద అనేది ఒక ఔషధ మొక్క. వీటి గింజలు చాలా విషపూరితమైనవి. రెసిన్ల కంటే 30 రెట్లు ఎక్కువ విషం ఇందులో ఉంటుంది. ఒక్క గురివింద గింజ తిన్నా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇందులో ఉండే అబ్రిన్.. వ్యక్తి కణాల్లోకి వెళ్లి ప్రొటీన్ తయారీని అడ్డుకుంటుంది. ఈ ప్రొటీన్లు లేకుంటే కణాలు చనిపోతాయి. ఈ ప్రక్రియ మొత్తం శరీరానికి హాని చేస్తుంది. దీంతో వ్యక్తి చనిపోతాడు. ఈ గింజలను పొడిచేసి పీల్చుకున్నా ప్రమాదకరమే. 36 నుంచి 72 గంటలలోపు వ్యక్తి మృతి చెందే ప్రమాదం ఉంటుంది.