భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కమలానెహ్రూ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి నలుగురు చిన్నారులు మృతిచెందిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ విచారం వ్యక్తంచేశారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అన్నారు. ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ ఘటన నేరపూరిత నిర్లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఘటన నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నుంచి తాను నివేదిక కోరానని, ఆ నివేదిక ద్వారా ఎక్కడ ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగింది, ఎక్కడ జరుగలేదు అనే విషయం తెలుసుకుంటానని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చెప్పారు. నిబంధనల ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు.