న్యూఢిల్లీ : రంజాన్ పర్వదిన వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరుల ప్రార్థనలతో మసీదులు, ఈద్గాలు కళకళలాడాయి. భారత సైన్యం కూడా రంజాన్ వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా జేసీపీ అట్టారి బోర్డర్ వద్ద భారత సైన్యం, పాకిస్తాన్ రేంజర్లు పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. పండుగల సందర్భంగా ఇరు దేశాల సైన్యం.. శుభాకాంక్షలు తెలుపుకోవడం, స్వీట్లు పంచుకోవడం అనేది సంప్రదాయంగా కొనసాగుతొన్న విషయం తెలిసిందే.
Punjab | Border Security Force & Pakistan Rangers exchange sweets and greetings at the JCP Attari border, on the occasion of #EidUlFitr, as part of the countries’ traditions. pic.twitter.com/jR6U1PrEDJ
— ANI (@ANI) May 3, 2022