Bones Found In Veg Biryani | వెజ్ బిరియానీ ఆర్డర్ చేసిన ఓ వెజిటేరియన్కు ఊహించని షాక్ తగిలింది. తాను ఆర్డర్ చేసిన వెజ్ బిరియానీలో బొక్కలు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. సదరు రెస్టారెంట్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆకాష్ దుబే అనే వ్యక్తి ఇండోర్లోని విజయ్ నగర్ ప్రాంతంలో గల ఓ రెస్టారెంట్కు వెళ్లాడు. అక్కడ వెజ్ బిరియాని ఆర్డర్ చేశాడు. సర్వర్ వచ్చి తన ప్లేట్లో బిరియాని సర్వ్ చేయగా అందులో బొక్కలు కనిపించాయి. ఆకాష్ దుబే పక్కా వెజిటేరియన్ కావడంతో ప్లేట్లో ఉన్న బొక్కలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సదరు రెస్టారెంట్ యజమానిపై స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజ్రాతీపై సెక్షన్ 298పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి సంపత్ ఉపాధ్యాయ తెలిపారు.