వారణాసి : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తమవారి అస్తికలను గంగా నదిలో నిమజ్జనం చేయడం ఇబ్బందికరంగా మారింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కొత్త సేవలను ప్రారంభించింది. నిమజ్జనం ప్రత్యక్ష వెబ్కాస్టింగ్ చేపట్టడంతో పాటు గంగాజల్ను కూడా వినియోగదారులకు పంపేందుకు సిద్ధమైంది. స్పీడ్ పోస్ట్ ద్వారా అస్తికలను పంపుతున్న పోస్టల్ శాఖ ఇందుకోసం బూడిదను వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్, గయలోని ఏదైనా ఒక తీర్థయాత్ర కేంద్రాలకు తీసుకెళ్లే సౌకర్యం కల్పించారు. అక్కడ ఓం దివ్య దర్శన సంస్థ ద్వారా పోస్టల్ విభాగం హిందూ ఆచారాలతో పండితుల సమక్షంలో బూడిదను నిమజ్జనం చేస్తారు.
ఓం దివ్య దర్శన్ అనే సామాజిక-మత సంస్థ సహకారంతో వారణాసి జోన్ పోస్ట్ మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ ఈ ప్రయత్నం మొదలెట్టారు. ఇప్పుడు అస్తికలను దేశంలోని ఏ మూల నుంచైనా స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్టాఫీసుల నుంచి వారణాసికి పంపవచ్చు. వారి ఆచార కర్మలను ఓం దివ్య దర్శన్ చేపడతారు.
ఈ సౌకర్యం కోసం ఓం దివ్య దర్శన్ సంస్థ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది. వారి పోర్టల్ : htpp: //omdivyasdarshan.org.
రిజిస్ట్రేషన్ తర్వాత.. ఏ వ్యక్తి అయినా తన కుటుంబ సభ్యుల అస్తికల ప్యాకెట్ను స్పీడ్ పోస్ట్ ద్వారా వారణాసి, ప్రయాగ్రాజ్, హరిద్వార్, గయాకు పంపవచ్చు.
బూడిదను సరిగ్గా ప్యాక్ చేసి బోల్డ్ అక్షరాలతో ‘ఓం దివ్య దర్శన్స అని బోల్డ్గా రాయాలి. పంపినవారు తమ పూర్తి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ను ప్యాకెట్పై రాయాలి.
స్పీడ్ పోస్ట్ ఛార్జ్ ఎన్వలప్ పంపినవారు మాత్రమే చెల్లించాలి. స్పీడ్ పోస్ట్ బుక్ చేసిన తర్వాత పంపినవారు సంస్థ పోర్టల్లో స్పీడ్ పోస్ట్ బార్ కోడ్ నంబర్తో పాటు బుకింగ్ వివరాలను నమోదు చేయాలి.
ప్యాకెట్ అందుకున్న తర్వాత దానిని ఓం దివ్య దర్శన్ చిరునామాకు పంపిస్తారు.
మరణించిన వారి బంధువులు ప్రత్యక్షంగా తిలకించేందుకు వెబ్కాస్ట్ సౌకర్యం కూడా ఉన్నది.
అన్ని కర్మలను పూర్తిచేసిన అనంతరం మరణించిన వారి కుటుంబానికి గంగా జల్ బాటిల్ కూడా పోస్ట్ ద్వారా పంపుతారు.
ఇమ్యూనిటీ బూస్టర్ : పనస గింజల్లో దాగి ఉన్న ఆరోగ్యం
ఫుల్ ట్రోలింగ్ : తొలి డోసు తీసుకున్న ములాయం
ఆధిపత్యం వద్దు : చైనా విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆందోళన
జీ 7 సమ్మిట్ : గ్లోబల్ టాక్సేషన్ సిస్టంకు గ్రీన్సిగ్నల్
ICAI CA 2021: సవరించిన షెడ్యూల్ విడుదల
లిలిబెట్ డయానా : రెండోసారి తల్లిదండ్రులైన హ్యారీ, మేఘన్
చరిత్రలో ఈరోజు.. తొలి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..