ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఇవాళ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ-మెయిల్ ఆ బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. బాంబు స్క్వడ్ బృందాలు, పోలీసులు స్టాక్ ఎక్స్చేంజ్లో తనిఖీలు నిర్వమించారు. అనుమానిత వస్తువులను గుర్తించలేదు. ఈ-మెయిల్ ఐడీ కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఉన్న మెయిల్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న భారీ బిల్డింగ్లో సుమారు నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులను అమర్చినట్లు మెయిల్లో పేర్కొన్నారు. బెదిరింపు మెయిల్ పట్ల గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మాతా రామాబాయ్ అంబేద్కర్ మార్గ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహితలోని 351(1)(b), 353(2), 351(3), 351(4) సెక్షన్ కింద కేసును రిజిస్టర్ చేశారు. ఈ కేసులో పోలీసులు మరింత దర్యాప్తు చేపడుతున్నారు. మరో వైపు ఇవాళ ముంబైలో టెస్లా షోరూమ్ను ఓపెన్ చేయనున్నారు.