ముంబై: అవినీతి కేసులో అరెస్టై జైల్లో ఉన్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత అనిల్ దేశ్ముఖ్ బెయిల్ ఆర్డర్పై స్టేను బాంబే హైకోర్టు పొడిగించింది. దాంతో ఆయన ఈ 27 వరకు బెయిల్పై బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అనిల్ దేశ్ముఖ్క్ బాంబే హైకోర్టు ఈ నెల 12 బెయిల్ మంజూరు చేసింది.
అయితే, బెయిల్ ఆర్డర్ 10 రోజుల తర్వాత నుంచి అమల్లోకి వస్తుందని బాంబే హైకోర్టు బెంచ్ సింగిల్ జడ్జి జస్టిస్ మకరంద్ కార్నిక్ పేర్కొన్నారు. ఆ ప్రకారం ఇవాళ్టితో బెయిల్ ఆర్డర్పై స్టే ముగిసింది. రేపు అనిల్ దేశ్ముఖ్ విడుదల కావాల్సి ఉంది. కానీ, దేశ్ముఖ్కు బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ సీబీఐ పిటిషన్ వేసింది.
ఇదే విషయంలో ఈ నెల 16న సుప్రీంకోర్టులో సైతం సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో అనిల్ దేశ్ముఖ్ బెయిల్ ఆర్డర్పై బాంబే హైకోర్టు ఈ నెల 27 వరకు స్టేను పొడిగించింది.