పట్నా: బీహార్లోని పట్నా రైల్వే జంక్షన్లో బాంబు పెట్టారంటూ అధికారులకు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో రైల్వే స్టేషన్లో గందరగోళం చెలరేగింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఓ ఆగంతకుడు ఫోన్ చేసి పట్నా రైల్వే జంక్షన్లో బాంబు పెట్టామని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు పోలీసులను రంగంలోకి దించారు. పట్నా రైల్వేస్టేషన్లో హై అలర్ట్ ప్రకటించారు.
బాంబ్ స్క్వాడ్ వచ్చి రైల్వే జంక్షన్ అంతటా బాంబు కోసం గాలించారు. కానీ ఎక్కడా బాంబు జాడ కనిపంచలేదు. దాంతో అది ఆకతాయిల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని పట్నా రైల్వే స్టేషన్ ఇన్చార్జి రంజిత్ కుమార్ తెలిపారు.