ముంబై: ఆర్టీసీ బస్సులో లైవ్ బాంబ్ను గుర్తించారు. (Bomb in Bus) ఈ విషయం తెలిసిన బాంబ్ స్క్వాడ్ వెంటనే ఆ బస్సు వద్దకు చేరుకున్నది. అందులో ఉన్న బాంబును నిర్వీర్యం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ సంఘటన జరిగింది. గణేష్పేట బస్ టెర్మినల్ వద్ద రెండు రోజులుగా ఒక ఆర్టీసీ బస్సు నిలిచి ఉంది. గడ్చిరోలి నుంచి వచ్చిన ఆ బస్సులో బాంబు మాదిరి పేలుడు పదార్థాన్ని బుధవారం గుర్తించారు. దీంతో బాంబు స్క్వాడ్కు సమాచారం ఇచ్చారు.
కాగా, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ వెంటనే అక్కడకు చేరుకుంది. బస్సులో గుర్తించిన లైవ్ బాంబును సురక్షిత ప్రాంతంలో నిర్వీర్యం చేసింది. పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు. దీంతో పెద్ద ముప్పు తప్పిందని తెలిపారు. మరోవైపు బస్సులో గుర్తించిన బాంబును స్క్వాడ్ నిర్వీర్యం చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Urgent situation at Ganeshpeth bus terminus, Nagpur. BDDS squad on-site neutralizing a live bomb found in a MSRTC bus arriving from Gadchiroli (MH 40 Y 5097). Swift action underway for public safety. 🚨 #Nagpur #BombAlert #NagpurSafety #BombSquad pic.twitter.com/aGd4lht4jM
— Dheeraj Fartode (@dheeraj_fartode) February 7, 2024