పాట్నా: ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నూడుల్ తయారీ కర్మాగారంలోని బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేసే ఆరుగురు కార్మికులు చనిపోయారు. 12 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి సీరియస్గా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. బాయిలర్ పేలుడుకు దారితీసిన కారణాలపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.