రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాలో గల వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింఘితరై గ్రామంలోని ప్లాంట్ బాయిలర్ ట్యూబ్లో మధ్యాహ్నం పేలుడు సంభవించింది.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డ వారిని దగ్గరలోని దవాఖానలకు తరలించారు. ప్రమాద స్థలిలో మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.