న్యూఢిల్లీ : సిక్కింలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన జవాన్లలో ఎనిమిది మంది మృతదేహాలను గుర్తించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం వెల్లడించారు. జవాన్లు, సాధారణ పౌరుల మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు వరదల నేపథ్యంలో మంగన్ జిల్లాలోని లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 3 వేల మందికి పైగా పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న 150 మంది కార్మికులు సిక్కిం-పశ్చిమబెంగాల్ సరిహద్దులో నిర్మితమవుతున్న రైల్వే టన్నెల్ వద్ద పని చేస్తున్న 150 మంది కార్మికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రాబోయే వరద విపత్తు గురించి తెలుసుకొన్న నిర్మాణ కంపెనీ అధికారులు వెంటనే కార్మికులు నివాసం ఉంటున్న ప్రాంతం వద్దకు వెళ్లారు. రాత్రి సమయంలో నిద్రపోతున్న కార్మికులను అప్రమత్తం చేసి, అక్కడి నుంచి క్షణాల్లో తరలివెళ్లేలా చేయడంతో పెనుప్రమాదం తప్పింది.