లక్నో : యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని యూపీ సర్కార్ తీసుకువచ్చిన జనాభా నియంత్రణ ముసాయిదా విధానాన్ని బీకేయు నేత గులాం మహ్మద్ జౌలా తోసిపుచ్చారు. యోగి ప్రతిపాదించిన ఇద్దరు పిల్లల విధానం ముస్లింలకు వర్తించదని స్పష్టం చేశారు. ముస్లింలు నాలుగు పెండ్లిండ్లు చేసుకోవచ్చని, దీని ప్రకారం నూతన చట్టానికి అనుగుణంగా కూడా తాము 8 మంది సంతానాన్ని కలిగి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.
యూపీ జనాభా నియంత్రణ బిల్లు 2021 ప్రకారం ఇద్దరు పిల్లలున్న జంటకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తుంది. జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లుపై జులై మాసాంతానికి రాష్ట్ర లా కమిషన్కు 8500 నుంచి ఫీడ్బ్యాక్ అందింది. ఇక జులై 11న యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ నూతన జనాభా విధానం 2021-30ను ఆవిష్కరించారు. స్ధిరమైన వృద్ధి సమతుల పంపిణీ కోసం జనాభా నియంత్రణ చేపట్టేందుకు ఈ బిల్లు కీలకమని యోగి పేర్కొన్నారు.