యూపీ ఎన్నికల విషయమై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతివ్వమని తేల్చి చెప్పారు. బీకేయూ అనేది రాజకీయ పార్టీ కాదని, తాము ఎవరికీ మద్దతివ్వమని ప్రకటించారు. రైతు ఆందోళన తాత్కాలికంగా నిలిపేసిన నేపథ్యంలో యూపీ ఎన్నికల గోదాలోకి ఆయన దిగుతున్నారన్న ప్రచారం బాగా ఊపందుకుంది.ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.అయితే యూపీలో విభజన రాజకీయాలను కొందరు కావాలనే సృష్టించారని, అవి త్వరలోనే సమసిపోతాయని అన్నారు. అయితే విభజన రాజకీయాల నుంచి లబ్ధి పొందే వారికి ఈ సారి మాత్రం వారికి చుక్కెదురవుతుందని టికాయత్ అన్నారు.