జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కాంగ్రెస్ను మట్టికరపించి మేజిక్ ఫిగర్ దిశగా బీజేపీ దూసుకుపోతోంది. రాజస్ధాన్ మాజీ సీఎం వసుంధర రాజె (Rajasthan Poll Results) జల్రపతన్ నియోజకవర్గం నుంచి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి రాంలాల్ చౌహాన్పై 51,000 ఓట్ల ఆధిక్యత కనబరిచారు.
2003 నుంచి వసుంధర రాజె జల్రపతన్ స్ధానం నుంచి గెలుపొందుతున్నారు. రాజస్ధాన్ సీఎం పగ్గాలను మరోసారి వసుంధర రాజె చేపట్టవచ్చని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు.
199 స్ధానాలు కలిగిన రాజస్ధాన్ అసెంబ్లీలో బీజేపీ మ్యాజిక్ మార్క్ దాటడంతో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఇక రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మ్యాజిక్ ముగిసిందని, అవినీతి కాంగ్రెస్ పాలనకు రాజస్ధాన్ ప్రజలు పాతరేశారని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు.
Read More :
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీ లీడింగ్