కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్ విజయంతో తిరిగి మమతా బెనర్జీ పాలనా పగ్గాలు చేపట్టడంతో తిరిగి పాలక టీఎంసీ గూటికి చేరతారని వస్తున్న వార్తలను బీజేపీ నేత ముకుల్ రాయ్ తోసిపుచ్చారు. పశ్చిమ బెంగాల్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు బీజేపీ సైనికుడిగా తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
కాగా శుక్రవారం జరిగిన కీలక బీజేపీ లెజిస్లేటర్ల సమావేశానికి ముకుల్ రాయ్ హాజరు కాకపోవడంతో ఆయన తిరిగి టీఎంసీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. తనపై వస్తున్న వదంతులు అసత్యమని..తన రాజకీయ గమ్యానికి తాను కట్టుబడి ఉన్నానని ముకుల్ రాయ్ ట్వీట్ చేశారు. ఇక బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాకాండపై గవర్నర్ జగ్దీప్ దంకర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని తనకు తక్షణమే నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.