అగర్తలా: త్రిపుర (Tripura) ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకుడు మాణిక్ సాహా (Manik Saha) వరుసగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేశారు. సరిహద్దు రాష్ట్రమైన త్రిపురలో బీజేపీకి తిరుగులేని మెజార్టీ సాధించిపెట్టిన మాణిక్తో రాజధాని అగర్తలాలోని (Agartala) వివేకానంద గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్ఎన్ ఆర్యా (Governor SN Arya).. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా ఆయనతో ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో రతన్ లాల్ నాథ్, ప్రాణ్జిత్ సింఘరాయ్, శాంతనా ఛక్మా, సుశాంతా చౌధురి, టింకూ రాయ్, బిక్ష్ దెబ్బర్మా, సుధాంగ్షూ దాస్, సుక్లా చరణ్ నౌటియా ఉన్నారు. మొత్తం 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో విజయం సాధించింది. కమ్యూనిస్టులకు కంచుకోటైన ఈ రాష్ట్రంలో.. మొదటిసారిగా 1988లో కాంగ్రెస్-టీయూజేఎస్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకున్నది. అయితే 1993లో మరోసారి కమ్యూనిస్టులో అధికారంలో వచ్చారు. అప్పటినుంచి ఏకఛత్రాదిపత్యంగా సాగుతున్న కమ్యూనిస్టుల పాలనకు గత ఎన్నికల్లో మాణిక్ సాహా బ్రేక్ వేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
BJP's Prof.(Dr.) Manik Saha takes oath as the Chief Minister of Tripura, in Agartala
(Pic: DD) pic.twitter.com/g4zwBfbkWj
— ANI (@ANI) March 8, 2023