చండీగఢ్: హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు (Dushyant Chautala) సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ను గురువారం కలిశారు. పానిపట్లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హర్యానా ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై వారు చర్చించారు.
కాగా, జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలను కలవడం ఆ పార్టీలో చీలికగా వాదనలు వినిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్ మీడియా కోఆర్డినేటర్ దీప్కమల్ సహారన్ దీని గురించి మాట్లాడారు. పార్టీ సభ్యులు విప్ను పాటించాలని అన్నారు. లేదా వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ‘వివిధ నియోజకవర్గాలకు చెందిన జేజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో కలిసి పనిచేయడం మేం చేశాం. పార్టీ మారితే, వారు కూడా బీజేపీ స్థానిక కేడర్ నుంచి అంతర్గత పోరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు అంగీకరిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది’ అని అన్నారు.