న్యూఢిల్లీ, మే 23: త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో పాటు ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని బరిలోకి దింపనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారా యి. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు కూడా జరుగుతుండటంతో సోమవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వం సమావేశమైంది.
ఈ భేటీకి అమిత్షా, జేపీ నడ్డా హాజరై దాదాపు నాలుగు గంటల పాటు చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికలపై రాజ్యసభ ఎన్నికలు కూడా ప్రభావితం చూపనున్నాయి.