ముంబై : పార్టీ కార్యాలయంలో మహిళను లైంగికంగా వేధించిన బీజేపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది కాషాయ పార్టీలో చేరేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీజేపీ సభ్యత్వం ఇప్పిస్తానని నిందితుడు నమ్మబలుకుతూ సబర్బన్ బొరివలీలోని పార్టీ కార్పొరేటర్ కార్యాలయంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.