పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని, 22 కంటే ఎక్కువ స్థానాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాలు తానే సీఎం పదవిలో కొనసాగుతానన్నారు. 40 స్థానాలనున్న గోవా అసెంబ్లీకి సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి.
ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. ఎన్నికల్లో 301 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించించుకుంటున్నారు. ఉత్తర గోవా జిల్లాలోని సంఖలిమ్ నియోజకవర్గంలో ఓటు హక్కు ప్రమోద్ సావంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తనతో ఫోన్లో మాట్లాడారని, ఎన్నికల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారన్నారు.
ఈ సందర్భంగా 22 సీట్లలో గెలుస్తామని ప్రకటించిన ఆయనగా.. బీజేపీ గెలుస్తుందా?.. సీఎంగా కొనసాగుతారా? అని ప్రశ్నించగా.. అందులో ఎలాంటి సదేహం లేదన్నారు. ప్రస్తుత ఎన్నికలు తన సారథ్యంలోనే జరుగుతున్నాయని, తానే ముఖ్యమంత్రిని కావడం ఖాయమన్నారు.