పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) తన ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. 400కు బదులు 4000 మందికిపైగా ఎంపీల గెలుపుతో మోదీ తిరిగి ప్రధాని అవుతారని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆర్జేడీని వీడి మళ్లీ బీజేపీతో కలిసి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్కు చెందిన జేడీ(యూ), ఎన్డీయేతో కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. ఆదివారం నవాడాలో జరిగిన ఎన్డీయే సభలో ప్రధాని మోదీతో కలిసి నితీశ్ కుమార్ వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన సమయానికి మించి మాట్లాడారు. ‘వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓట్లు ప్రధానికి వేస్తారు. 4000 మందికిపైగా ఎంపీల మద్దతుతో ఆయన తిరిగి ఆ పదవి చేపడతారు’ అని అన్నారు. అలాగే తమ ప్రభుత్వం శ్మశానాల చుట్టు ఫెన్సింగ్ వేస్తున్నదని చెప్పారు.
కాగా, ప్రసంగం తర్వాత నితీశ్ కుమార్ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ఆయన పాదాలు తాకారు. దీంతో ఆయనలో జోష్ నింపేందుకు మోదీ ప్రయత్నించారు. ‘మీరు ఇంత మంచి ప్రసంగం ఇచ్చారు. నేను మాట్లాడటానికి ఏమీ మిగిలి లేదు’ అని అన్నారు.
మరోవైపు నితీశ్ కుమార్ ప్రసంగం ముగింపు కోసం వేదికపై ఉన్న నేతలు అసహనంతో ఎదురు చూశారు. జేడీయూ సీనియర్ నేత కూడా తన వాచీ చూసుకున్నారు. నితీశ్ కుమార్ ప్రసంగానికి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आज नीतीश जी ने तो 4000 पार का नारा लगा दिया। 🤣 pic.twitter.com/Sef6ACaSxo
— Kanchana Yadav (@Kanchanyadav000) April 7, 2024
This should go viral and everyone in Bihar should watch this
Nitish Kumar had to touch Modi's feet and then do Pranam to him. This is what Chief Minister has reduced to?
Stop treating someone like God. pic.twitter.com/6aH6UgR7CH
— AmOxxicillin FC (@amoxcicillin1) April 7, 2024